Tuesday, April 16, 2024

మరో కేంద్ర మంత్రికి కరోనా

ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడగా సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు.

తాజాగా మరో కేంద్ర మంత్రి కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ప్రోటోకాల్ ప్రకారం తనను కలిసిన వ్యక్తులు టెస్టులు చేయించుకొని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement