Thursday, April 25, 2024

వెంకయ్య నాయుడి నివాసంలో ఉగాది మిలన్.. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్వహించిన ఉగాది వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం సాయంత్రం వెంకయ్య నాయుడి అధికారిక నివాసంలో ఉగాది మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషారాణి, కుమార్తె దీపావెంకట్ సహా ఇతర కుటుంబ సభ్యులకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రధానమంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, రాజ్యసభ ఛైర్మన్ హరివంశ్, కేంద్రమంత్రి పియూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement