Thursday, April 18, 2024

యాదాద్రి: రిజర్వాయర్‌లో ఇద్దరు యువకులు గల్లంతు

భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఆ ఇద్ద‌రు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉద‌యం రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద చెప్పులు క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల స‌హాయంతో రిజ‌ర్వాయ‌ర్‌లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇద్ద‌రిలో ఒక‌రి మృత‌దేహం ల‌భ్య‌మైంది. మ‌రొక‌రి కోసం గాలిస్తున్నారు. ఇద్ద‌రు యువ‌కుల‌ను లింగాల హేమంత్ (14), సింగిరెడ్డి ప‌వ‌న్ కుమార్ (14)గా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రేమికుడి ప్రాణాలు కాపాడిన రైలు డ్రైవర్

Advertisement

తాజా వార్తలు

Advertisement