Friday, March 29, 2024

Big Breaking: కూలిన రెండు యుద్ద‌ విమానాలు.. ఒక‌రు మృతి, ముగ్గురికి గాయాలు

మ‌ధ్య ప్ర‌దేశ్ లో రెండు యుద్ద విమానాలు కూలిపోయాయి. సుఖోయ్ 30, మిరాజ్ విమానాలు కుప్ప‌కూలాయి. మొరెనా స‌మీపంలో రెండు విమానాలు కూలిపోయాయి. శిక్షణ సమయంలో సుఖోయ్, మిరాజ్ అనే రెండు విమానాలు ఢీకొన్నట్లు సమాచారం. గ్వాలియర్ ఆర్మీ ఎయిర్ బేస్ నుంచి ఈ రెండు విమానాలు టేకాఫ్ అయినట్లు తెలుస్తోంది. శిక్షణా, విన్యాసాలు చేస్తున్న సమయంలో యుద్ధ విమానాలు కూలిపోయాయి. అయితే ఈ ప్రమాదాల్లో ఒకరు చనిపోగా… ముగ్గురు గాయపడ్డారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటన కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement