Tuesday, April 23, 2024

‘వకీల్ సాబ్’ సినిమా ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లు సీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న ఒడిశాలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో‘వకీల్‌సాబ్’ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్న గజపతి జిల్లా పర్లాఖెముండిలోని రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. పట్టణంలోని రెండు థియేటర్లలో సినిమా విడుదల కాగా సినిమాను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో థియేటర్ల వద్ద భారీ రద్దీ ఏర్పడుతోంది. ఆదివారం కావడంతో నిన్న అభిమానుల తాకిడి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అభిమానులు కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు. వెంటనే స్పందించిన అధికారులు కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ రెండు సినిమా థియేటర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement