Thursday, April 25, 2024

BIG BREAKING : గోదావరిలో చిక్కుకున్న ఇద్ద‌రు.. హెలికాప్టర్ సహాయంతో రక్షించిన అధికారులు

  • కేటీఆర్ కు సమాచారం ఇచ్చిన బాల్క సుమన్
  • హెలికాప్టర్ పంపించిన మంత్రి కేటీఆర్

గోదావరి నదిలో ఇద్దరినీ హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో గురువారం ఇద్దరు చిక్కుకున్నారు. ఆచార అందుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు సైతం వెళ్లలేని పరిస్థితి ఉండడంతో మంత్రి కేటీఆర్ కు ఫోన్ లో సమాచారం అందించారు. స్పందించిన మంత్రి కేటీఆర్ హుటాహుటిన హెలికాప్టర్ ను పంపించారు. నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వరద నీటిలో ప్రాణాలు కోల్పోతామని భావించామని, ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నామని బాధితులు బాల్క సుమన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచారం అందించగానే హెలికాప్టర్ పంపించిన మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement