Thursday, March 28, 2024

పుల్వామాలో ఎన్​కౌంటర్​.. ఇద్దరు టెర్రరిస్టులు హతం, రెండు ఏకే రైఫిల్స్​ స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలతో రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం రాత్రి ఇద్దరు అనుమానిత జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాదులను గుర్తించడానికి భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగాయని, ఈ క్రమంలో వారిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు కాశ్మీర్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పోస్టు చేశారు. సోమవారం ఉదయం మరో ఉగ్రవాది హతమైనట్లు వారు ధ్రువీకరించారు. వారి నుంచి రెండు ఏకే రైఫిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement