Thursday, April 18, 2024

కర్నూలు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు ఆదివారం ఉదయం మృతి చెందారు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు బ్లాక్ ఫంగస్ లక్షణాలతో రెండ్రోజుల క్రితం చేరగా…చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కర్నూలు నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు కొవిడ్​తో ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకింది. కాగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ వీరిద్దరూ మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement