Thursday, April 25, 2024

మార్క‌ట్ లో కొత్త‌గా మ‌రో రేండు బ్రాండెడ్ కార్లు..

టొయోటా హిలుక్స వచ్చేసింది..

భారత్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైఫ్‌స్టైల్‌ పికప్‌ ట్రక్‌ హిలుక్స్‌ను ఆవిష్కరించినట్టు టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వెల్లడించారు. మార్చి నుంచి భారత మార్కెట్లో విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డబుల్‌- క్యాబ్‌ వేరియెంట్‌లో మాత్రమే ఇది లభిస్తుంది. కారు ఫేస్‌ కొత్తగా కనిపిస్తుందని టొయోటా వివరించింది.

2022 బీఎండబ్ల్యూ ఎక్స3 అదిరింది..

కొత్త లుక్‌తో 2022 బీఎం డబ్ల్యూ ఎక్స్‌3 భారతీయ మార్కెట్లో విడుదలైంది. ప్రీమియం ఇంటీరి యర్‌తో కొత్త ఎక్విప్‌మెంట్‌ ఫీచర్లు, ఆధునీకరించిన ఇ న్ఫోటెయిన్‌మెంట్‌తో వచ్చిందని బీఎం డబ్ల్యూ వెల్లడించింది. రెండు పెట్రోల్‌ వేరియెంట్లలో 2022 బీఎండబ్ల్యూ ఎక్స్‌3 లభిస్తుంది. స్పోర్ట్‌ఎక్స్‌ ప్లస్‌ ధర రూ.59.90 లక్షలు కాగా ఎం స్పోర్ట్‌ ధర రూ.65.90 లక్షలుగా ఉంది. డీజెల్‌ వేరియెంట్‌ను తర్వాత విడుదల చేయనున్నట్టు పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement