Friday, April 19, 2024

లోయలో ప‌డ్డ ఆర్మీ ట్ర‌క్కు – ఇద్ద‌రు జ‌వాన్లు దుర్మ‌ర‌ణం..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శ‌నివారం నాడు ఆర్మీ జ‌వాన్ల‌కు సంబంధించిన అంబులెన్స్ కేరి సెక్టార్ వ‌ద్ద రోడ్డుప్ర‌మాదానికి గురైంది. అతి వేగంతో దూసుకొచ్చిన అంబులెన్స్ అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు జ‌వాన్లు మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్ల‌డించారు. అంబులెన్స్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందిస్తున్న‌ట్లు తెలిపారు. మృతుల కుటుంబాల‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటామ‌ని ఆర్మీ ఉన్న‌తాధికారులు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement