Thursday, April 18, 2024

రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ప్రమాదమేనట..

మహమ్మారి కరోనా కట్టడికిి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశాయి. మునుముందు వివిధ రకాల వేరియట్లు, థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రతిదేశం కూడా వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే కొందరు మాత్రం మొద‌టి డోసు ఓ సంస్థ‌కు చెందిన వ్యాక్సిన్ వేసి రెండో డోసు మ‌రో వ్యాక్సిన్ వేసినా మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ప‌లువురు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పలు దేశాల అధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు వేయించుకున్నారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ మొద‌టి డోసు  ఆస్ట్రాజెనెకా సంస్థ‌కు చెందిన వ్యాక్సిన్ వేయించుకుని, రెండో డోసు మాత్రం మోడెర్నా సంస్థ‌కు చెందింది వేయించుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి  కూడా వేర్వేరు వ్యాక్సిన్ల‌ను వేయించుకుని ఈ విధానాన్ని ప్రోత్స‌హించారు.

అయితే, ఈ తీరుపై  WHO చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చ‌రించారు. క‌రోనా వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై ఇప్ప‌టివ‌ర‌కు సరైన డేటా అందుబాటులో లేద‌ని చెప్పారు. అంతేగాక‌, ప్రజలే సొంతంగా ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఆందోళనకరమైన విష‌య‌మ‌ని తెలిపారు. అయితే కెనడా, యూకే, యురోపియ‌న్ యూనియ‌న్ లోని ప‌లు దేశాలు, స్పెయిన్, ద‌క్షిణ కొరియా కూడా రెండు వేరు వేరు వ్యాక్సిన్ డోసుల విధానాన్ని అవ‌లంభిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తర్వాత సమస్యలను తప్పించేందుకు ఈ విధానాన్ని పాటిస్తున్న‌ట్లు ఆయా దేశాలు చెప్పాయి. WHO హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశాలు తమ పంథా మార్చుకుంటాయేమో చూడాలి..

ఇది కూడా చదవండి: గూగుల్‌కు రూ.4,415 కోట్ల జరిమానా

Advertisement

తాజా వార్తలు

Advertisement