Friday, April 26, 2024

తిరుపతిలో ఇద్దరు చైన్‌ స్నాచింగ్ దొంగల అరెస్టు..

తిరుపతిలో ఇద్దరు చైన్‌ స్నాచింగ్‌ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. భార్యాభర్తల ముసుగులో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధ, ఒంటరి మహిళలే టార్గెట్‌గా కళ్లలో కారంచల్లి దోపిడీలు చేస్తున్నారు. తిరుపతి రూరల్‌, చంద్రగిరి, పుదిపట్ల, అలిపిరిలో చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. నిందితులు నల్లొండ, కర్నూలుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement