Thursday, April 25, 2024

రెండు బైక్ లు ఢీకొని… ఒకరు మృతి. ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైక్ లు ఢీకొని ఒక‌రు మృతిచెంద‌గా.. ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మృతుడు అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన నండూరి రవి (23)గా గుర్తించారు. మృతుడు వైకుంఠపురం నుండి గుంటూరు వెళ్తుండగా తాడికొండ మండలం మొతడక గ్రామంలోని సాయి బాబా గుడి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనగా రవి అక్కడిక్కడే మృతిచెంద‌గా.. గాయాల పాలైన ఇద్దరినీ చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు 108లో స్థానికులు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement