Wednesday, April 17, 2024

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన నిందితుడు

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసులో ఈడీ ముందు నిందితుడు కెల్విన్ అప్రూవర్‌గా మారాడు. 6 నెలల క్రితం కెల్విన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ అధికారుల కేసు ఆధారంగా ఈడీ ఈ కేసు ఫైల్ చేసింది. అయితే ఎక్సైజ్ అధికారుల ముందు నోరు విప్పని కెల్విన్… ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారి సినీ తారల చిట్టా విప్పాడు.

కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే పలువురు సినీ తారలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కెల్విన్ అకౌంట్‌లోకి భారీగా నిధులను సినీ తారలు బదిలీ చేశారు. దీంతో ఇప్పటికే కెల్విన్ అకౌంట్‌ను ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. కెల్విన్ అకౌంట్ ఆధారంగా సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ కేసును ఈడీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మంగళవారం నాడు చాలా సేపు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను అధికారులు విచారించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు

Advertisement

తాజా వార్తలు

Advertisement