Friday, March 29, 2024

TV Show: త‌మ‌న్నా వ‌ల్ల కోట్లాది రూపాయల నష్టం వచ్చిందట‌.. ఎవ‌రికో తెలుసా..

Master Chef: ప్రముఖ ఎంటర్‌టైన్‌ మెంట్ చానల్ జెమిని టీవీలో ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా ఈ షో ప్రారంభమయింది. అయితే ఈమ‌ధ్య‌నే తమన్నాను తొలగించి.. యాంకర్ అనసూయను హోస్ట్ గా తీసుకున్నారు. ఈ మార్పు చాలా చర్చనీయంశమయింది. దీనికి సంబంధించి పలు కథనాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్‌ చేశారు. రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేలా తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నామని ఆ నోట్‌లో పేర్కొన్నారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆమె అగ్రిమెంట్ పై సంతకం చేశారని చెప్పారు.

అయితే ఆమె ఇతర కమిట్ మెంట్ల వల్ల కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చారని.. రెండు రోజులు రాలేదని తెలిపారు. ఈ రెండు రోజులు ఆమె షూటింగ్ కు రాకపోవడం వల్ల… 300 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్న తమకు రూ. 5 కోట్లకు పైగా నష్టం వచ్చిందని వెల్లడించారు.

ఆమెకు అప్పటికే రూ. 1.56 కోట్ల పేమెంట్ చేశామని.. చివరి రెండు రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసి ఉంటే మిగిలిన పేమెంట్ కూడా చేసేవాళ్లమని తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా.. సెకండ్ సీజన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారని.. అసలు సెకండ్ సీజన్ కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని స్పష్టం చేసింది మాస్ట‌ర్ చెఫ్ టీమ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement