Thursday, March 28, 2024

సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీ-5

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో తమపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయడంపై టీవీ-5 ఛానల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రఘురామ కృష్ణంరాజు విద్వేష ప్రసంగాలను ప్రసారం చేశామంటూ తమపై సీఐడీ అధికారులు కేసు పెట్టారని.. ఉద్దేశపూర్వకంగానే తమ ఛానల్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని టీవీ-5 తన పిటిషన్‌లో పేర్కొంది. తమ సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఛానల్‌ అభ్యర్థించింది. సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని టీవీ-5 యాజమాన్యం సుప్రీంకోర్టును కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement