Wednesday, April 24, 2024

ఆగస్టు నెల తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు విడుదల

ఆగస్టు నెలకు తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రూ. 300 విలువ చేసే టికెట్లను ఆన్ లైన్లో ఉంచింది. కరోనా నేపథ్యంలో రోజుకు 5 వేల టికెట్లను మాత్రమే అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ ఉదయం 9 గంటలకు టికెట్లను ఆన్ లైన్‌లో ఉంచడంతో… భక్తులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో టికెట్ల కోసం ప్రయత్నించారు.

దీంతో టీటీడీ వెబ్ సైట్ సర్వర్ డౌన్ అయింది. కాసేపు వెబ్ సైట్లో టికెట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న భక్తులు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికి వెబ్ సైట్ ఇబ్బందులు లేకుండా పనిచేసింది. ఆగస్ట్ నెల అకామడేషన్ కు సంబంధించిన స్లాట్ బుకింగ్స్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చేవారు కోవిడ్ నిబంధనలను పాటించాలని టీటీడీ కోరింది.

ఈ వార్త కూడా చదవండి: హుజురాబాద్‌లో టీడీపీ పోటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement