Friday, April 19, 2024

ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా సజ్జనార్

తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీ సంస్థ TSRTCని గట్టెక్కించేందుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ రంగంలోకి దిగారు. సాధారణ ప్రయాణికుడిలా సిటీబస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు బస్సులో వెళ్తూ ప్రయాణికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంజీబీఎస్‌లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులకు సజ్జనార్ పలు సూచనలు చేశారు. పాడైపోయిన వాహనాలను స్క్రాప్ యార్డుకు తరలించాలని ఆయన ఆదేశించారు. టీఎస్ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచేందుకు అందరూ కృషి చేయాలని సజ్జనార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement