Thursday, March 28, 2024

నోరూరించే బంగినపల్లి మామిడి పండ్లు ఇంటికే.. ఆర్డర్‌ చేస్తే చాలు అందించనున్న టీఎస్‌ఆర్టీసీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్మాణాత్మక కార్యాచరణలతో ప్రయాణికులకు, వినియోగదారులకు మరింత చేరువవుతోంది. గతంలో మేడారం ప్రసాదం, శ్రీరాముని తలంబ్రాలు భక్తులకు తన పార్సిల్‌ సేవల ద్వారా అందించిన ఆర్టీసీ ప్రస్తుతం తక్కువ ధరకే జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను పార్సిల్‌ సేవల ద్వారా ప్రజలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్డర్‌ చేసిన వారికి మామిడి పండ్లను నేరుగా వారి గుమ్మం ముందుకు డోర్‌ డెలివరీ చేయనుంది. 5,10,15 కేజీలతో పాటు టన్ను, 10 టన్నుల వరకు పరిమాణాల్లో మామిడి పండ్ల పార్సిల్‌లు అందించనుంది.

కేజీ రూ.115 చొప్పున ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకున్నవారికి వారం రోజుల్లో మామిడి పండ్లు అందించనున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, చైర్మన్‌ బాజిరెడ్డిలు తెలిపారు. ఈ అవకాశాన్ని మామిడి ప్రియులు వినియోగించుకోవాలని వారు కోరారు. ఇతర వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌సెంటర్‌ 040-23450033, 040-69440000లో సంప్రదించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement