Thursday, March 28, 2024

జూలై 10 నుంచి డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌లు

తెలంగాణలో మే 2021 సెషన్ డిపార్ట్‌మెంటల్ టెస్టులను జూలై 10 నుంచి 19వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్ల‌డించింది. అంత‌కుముందు కోవిడ్-19 మ‌హ‌మ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు కార‌ణంగా పరీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధితో పాటు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా ప్రధాన కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్‌లో ఈ పరీక్షలు జరుగుతాయని బుధవారం తెలిపింది. సవరించిన టైమ్‌టేబుల్, ఇతర అవసరమైన సమాచారం కోసం కమిషన్ వెబ్‌సైట్ www.tspsc.gov.in ని సందర్శించాల్సిందిగా సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement