Tuesday, April 23, 2024

పలు పోస్టులకు పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇప్పటికే వెలువరించిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. 148 అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షను ఏప్రిల్‌ 25న నిర్వహించనున్నట్లు తెలిపింది. డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌(18) పరీక్షను మే 7న, పాలిటెక్నిక్‌ అధ్యాపకుల(247) పరీక్షను మే 13న నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్యలోని 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షను మే 17న, ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్యలోని లైబ్రేరియన్‌(71) పరీక్షను మే 17న నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement