Friday, April 19, 2024

TS: దళితులను తిట్టి, కొట్టిన హరీశ్ రావుకు బాధ్యతలను అప్పగించడం సిగ్గుచేటు: విజయశాంతి

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై బీజేపీ లీడ‌ర్‌ విజయశాంతి ఫైర్ అయ్యారు. దళితుల పట్ల ఏమాత్రం గౌరవం లేని హరీశ్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు.

ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా హరీశ్ రావు బూతులు తిట్టారని, చేయి కూడా చేసుకున్నారని ఆమె అన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అయితే.. హరీశ్ రావు దళిత ద్వేషి అని విజ‌య‌శాంతి దుయ్యబట్టారు. వీరిద్దరికీ హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వ‌చ్చింద‌న్నారు లేడీ బాస్‌.

హరీశ్ రావు దళితబంధు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. దళితుల పట్ల అగౌరవంగా ప్రవర్తించిన హరీశ్ రావు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని అన్నారు. హరీశ్ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కథలు పడినా… కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేస్తారని, హరీశ్ రావును పార్టీ నుంచి వెళ్లగొడతారని జోష్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement