హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈనెల 13న నిర్వహించాల్సిన టీఎస్ సెట్-2022 పరీక్షను ఈనెల 17వ తేదీకు వాయిదా వేసినట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సి.మురళీకృష్ణ తెలిపారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈనెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే రోజు ఉన్న సెట్ పరీక్షను 17న నిర్వహించనున్నట్లు తెలిపారు. సెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 14, 15 తేదీల్లో నిర్వహించబోయే పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement