Saturday, April 20, 2024

టీఎస్ ఎల్పీసెట్ నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌ సెకండియర్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించే ఎల్పీ సెట్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ప్రకటించింది. పాలిటెక్నిక్‌ సెకండియర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్పీ సెట్ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యామండలి గురువారం విడుదల చేసింది. రేపటి నుంచి ఈనెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. https://sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ వివరాలున్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement