Tuesday, April 23, 2024

జులై ఒక‌టో తేదిన గ్రూప్ 4 ఎగ్జామ్..

హైద‌రాబాద్ – గ్రూప్‌-4 పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్‌సీ (రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పేపర్‌-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కాగా, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. గ్రూప్‌-4 పరీక్షకు ఇప్పటికే 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8 వేలకు పైగా ఉద్యోగాల కోసం ఈ గ్రూప్‌-4 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, వార్డ్‌ ఆఫీసర్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement