Tuesday, April 23, 2024

టీఎస్‌ పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ఈనెల 19 నుంచి రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వ్యాయామ విద్యా కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) ప్రవేశాల (పీఈసెట్‌) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు.

నవంబర్‌ 2వ తేదీన బీపీఈడీ, డీపీఈడీ సీట్లను కేటాయించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు నవంబర్‌ 3 నుంచి 11 తేదీలోపు రిపోర్టింగ్‌ చేయడంతోపాటు కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్‌ 14 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement