Thursday, March 28, 2024

బీజేపీ కార్యకర్తల బట్టలు విప్పించిన టీఆర్ఎస్ నేతలు

వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో అలజడి జరిగింది. వరంగల్ లో 34వ డివిజన్ లో ఓటర్ స్లిప్పులు పంచుతున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేతలు కషాయం వస్త్రాలు ధరించిన బీజేపీ పార్టీ కార్యకర్తల బట్టలు విప్పించారు. అలానే ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇరు పార్టీలతో మాట్లాడి శాంతింప జేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement