Monday, April 15, 2024

గమనిక: సాయం కావాలంటే ఈ నంబర్లకు కాల్ చేయండి

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 నెంబర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజల నుండి నిరంతరం ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశామని ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement