Thursday, April 25, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి

కోడిగుడ్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై దాడి జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం చౌర‌స్తాలో ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కొంతమంది గుడ్లతో దాడికి దిగారు. ఎన్ఎస్ యూఐ సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి వాహ‌నాన్ని అడ్డుకున్న ఎన్ఎస్ యూఐ సభ్యులు ఆయ‌న కారుపై కోడిగుడ్లు విసిరారు. ఎన్ఎస్ యూఐ సభ్యులు చ‌ర్య‌తో ఆగ్రహించిన మంచిరెడ్డి అనుచ‌రులు..గన్ మన్ వెంటనే కారు దిగి మరీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని ప‌ట్టుకుని చితక్కొట్టినట్లుగా తెలుస్తోంది. త‌మ నాయ‌కుడి వాహ‌నాన్నే అడ్డుకుంటారా ? దాడులు చేస్తారా ? అంటూ ఎదురుదాడికి దిగారు.

దీంతో సాగర్ హైవేపై టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రోజుల క్రితం ఎన్ఎస్ యూఐ నేత‌లు ఎమ్మెల్యే కాంప్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. అప్పుడు కూడా ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. అప్పుడు కూడా కాంగ్రెస్ శ్రేణుల‌పై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడికి దిగారు. అయితే ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్ల‌తో దాడి చేశారు. అయితే ఆరోజు ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా ఇప్పుడు ఎమ్మెల్యే వాహ‌నాన్ని అడ్డుకుని కోడిగుడ్లు కొట్టారని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement