Thursday, March 28, 2024

బీజేపీకి షాక్.. గుండు గీయించుకున్న ఎమ్మెల్యే

త్రిపుర‌లో అధికార బీజేపీకి సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగులుతోంది. రాష్ట్రంలో బీజేపీ పాలన సరిగా లేదంటూ ఆపార్టీకి చెందిన ఓ గుండు గీయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సుర్మా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఆశిష్‌ దాస్.. కోల్‌క‌తాలోని కాళీఘ‌ట్ ఆల‌యం వ‌ద్ద త‌న త‌లనీలాల‌ను అర్పించారు. బీజేపీ చేసిన త‌ప్పుల‌కు తాను గుండు గీయించుకున్న‌ట్లు చెప్పారు. త్రిపుర‌లో బీజేపీ రాజ‌కీయ అరాచ‌కానికి పాల్ప‌డుతోంద‌ని, గంద‌ర‌గోళం సృష్టిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ పాల‌న ప‌ట్ల త్రిపుర ప్ర‌జ‌లు సంతోషంగా లేర‌ని తెలిపారు. అందుకే తాను బీజేపీని వీడుతున్న‌ట్లు ప్రకటించారు. కాగా, ఆశిష్ దాస్ త్వ‌ర‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement