Thursday, April 18, 2024

ఆగస్టులో మూడు దేశాల టీ20.. ఐర్లాండ్‌లో మ్యాచ్‌లు

ఈ సంవత్సరం ఆగస్టులో ఐర్లాండ్‌లో మూడు దేశాల టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ ట్రై సీరీస్‌ జరగనుంది. ఈ విషయాన్ని ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం నాడు తెలిపింది. ఐర్లాండ్‌ క్రికెట్‌ ప్రియులు ఆగస్టులో టీ20 సీరిస్‌ సమయంలో ప్ర్‌పంచ నెంబర్‌ వన్‌ జట్టు భారత్‌ ఆటను చూసి ఆనందించవచ్చని బోర్డు పేర్కొంది. ఈ టోర్నమెంట్‌ను ఐర్లాండ్‌ నిర్వహించనుంది. భారత జట్టు రాకను అధికారికంగా ధృవీకరించినట్లు ఐర్లాండ్‌ బోర్డు తెలిపింది.

ఈ వేసవిలో డిఫరెంట్‌ క్రికెట్‌ను ఆస్వాధించవచ్చని పేర్కొంది. ఈ టోర్నీలో భారత్‌, ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌ టీమ్‌లు పాల్గొంటాయి. ఐర్లాండ్‌లో వరసగా రెండో సంవత్సరం కూడా భారత జట్టు పర్యటించనుంది. లార్డ్‌ ్సలో జూన్‌లో జరిగే ఇప్పటికే ప్రకటించిన టెస్ట్‌ మ్యాచ్‌, సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఉంటుందని ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వారెన్‌ డ్యూట్రోమ్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement