Wednesday, April 24, 2024

Breaking | తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ

తెలంగాణ వ్యాప్తంగా 41 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఇవ్వాల రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్ట ఏసీపీ గణేశ్‌ బదిలీ కాగా.. ఆయన స్థానంలో ఎస్.మోహన్ కుమార్‌ను నియమించారు. కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీగా ధనలక్ష్మి నియమితులయ్యారు. అబిడ్స్ ఏసీపీగా పూర్ణచందర్, మీర్‌చౌక్ ఏసీపీగా దామోదర్‌ రెడ్డి, సంతోశ్‌నగర్ ఏసీపీగా మహమ్మద్ గౌస్, చార్మినార్ ఏసీపీగా రుద్ర భాస్కర్, మలక్‌పేట్ ఏసీపీగా శ్యాంసుందర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవలే రాష్ట్రంలో 91 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement