Thursday, March 28, 2024

57మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ, పోస్టింగ్‌లు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 57 మంది డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టిగ్‌లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పురపాలక, రెవెన్యూ, ఇరిగేషన్‌ విభాగాల్లో పనిచేస్తున్న వారికి స్థాన చలనం కలిగింది. సీఆర్‌డీఏ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బీ సాయి శ్రీనివాస్‌నాయక్‌, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ వ్యక్తిగత కార్యదర్శిగా పికృష్ణ మూర్తి, అనకాపల్లి బీజేఆర్‌ సుజల స్రవంతి ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా కెరమామణి, సీసీఎల్‌ ఏ (ల్యాండ్‌ అక్విజిషన్‌) విభాగం ఎస్‌డీసీగా వీ సుబ్బారావు, అనంతపురం కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీగా జీ శంకరయ్య, మందపల్లి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 ఎస్‌డీసీగా పీ రోహిణి నియమితులయ్యారు.

కాగా వివిధ సాగునీటి ప్రాజెక్టులు, దేవాదాయశాఖ, యువజన, క్రీడా సర్వీసు విభాగాల్లో పనిచేస్తున్న మరికొందరు డిప్యూటీ కలెక్టర్లకు కూడా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement