Thursday, April 25, 2024

తప్పిన రైలు ప్రమాదం..

 బీహార్ లోని పాట్నాలో ఘోర ప్రమాదం తప్పింది. నార్కటిగంజ్-రక్సౌల్ (05210) ప్యాసింజర్‌ రైలు, కుమార్‌బాగ్ స్టేషన్ సమీపంలో పట్టాలు మారుతుండగా ఓ కంపార్ట్‌మెంట్‌కు చెందిన రైలు చక్రం ఊడిపోయింది. అయితే విషయం పసిగట్టిన లోకో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేశాడు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని సమస్తిపూర్ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. చంపారన్ జిల్లా జరిగింది ఘటన.

ఇది కూడా చదవండి: ప్రెగ్నెంట్ అవ్వాలి నాభర్తని పంపించండి అని కోర్టుకెక్కిన మహిళ

Advertisement

తాజా వార్తలు

Advertisement