Thursday, April 25, 2024

ప‌ట్టాలు దాటుతుండ‌గా క‌దిలిన రైలు.. గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన మ‌హిళ‌

ప్లాట్ ఫాంకి అవ‌త‌లివైపు ఉన్న ప్యాసింజ‌ర్ రైలు ఎక్కేందుకు ఓ మ‌హిళ ప‌ట్టాలు దాటుతుండ‌గా ఆగి ఉన్న గూడ్స్ రైలు క‌దిలింది. గూడ్స్ బండి మధ్యలో నుంచి అవతలి వైపునకు వెళుతుండగా సడెన్ గా రైలు కదిలింది. రైలు మధ్యలో ఉండడంతో సదరు మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. బయటపడే సమయం లేకపోవడంతో అలాగే పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయాక ప్లాట్ ఫాం మీదున్న ఇతర ప్రయాణికులు పరుగున వెళ్లి ఆ మహిళను లేపారు. రైలు పైనుంచి వెళ్లడంతో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రమాదమేమీ లేదని తెలిపారు. పట్టాలు దాటేందుకు ఇలా ప్రాణాలు పణంగా పెట్టొద్దని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.ఈ సంఘ‌ట‌న తనుకుప్ప స్టేషన్ లో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement