Friday, April 19, 2024

ప్రేమికుడి ప్రాణాలను కాపాడిన రైలు డ్రైవర్

గుంటూరు: తాడేపల్లి సమీపంలోని కృష్ణాకెనాల్ జంక్షన్ వద్ద ఓ ప్రేమికుడు రైల్వేట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన రైలు డ్రైవర్ బ్రేక్ వేయటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రేమ విఫలం కావడంతో తాడేపల్లి నులకపేటకు చెందిన పృథ్వీ అనే యువకుడు రైలు కింద పడి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రైలుపట్టాలపై పడుకున్నాడు.

అదే సమయంలో ముంబై నుంచి కాకినాడ వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్ (డ్రైవర్) హనుమంతరావు ట్రాక్‌పై పడుకున్న యువకుడిని చూసి కేవలం 100 మీటర్ల దూరంలో ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. కానీ యువకుడికి ప్రాణం అయితే నిలబడింది కానీ అప్పటికే రైలు ఇంజిన్ యువకుడి కాళ్లపై నుంచి వెళ్లడంతో ఈ ఘటనలో పృథ్వీ తన రెండు పాదాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని అదే రైలులో విజయవాడకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం పృథ్వీ విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: ప.గో. జిల్లాలో 9 నెలల బాలుడు దారుణహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement