Friday, April 19, 2024

ట్రైలర్ టాక్: ఫన్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈరోజు హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆహ్లాదకరమైన క్షణాలు, కుటుంబ సన్నివేశాలు, పెళ్లి చేసుకోవడానికి హీరో చేసే తీరని ప్రయత్నాలతో ట్రైలర్ నిండిపోయింది. శర్వానంద్, రష్మిక మందన్న మధ్య వచ్చే సన్నివేశాలు మరో హైలైట్. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి డీసెంట్ ఎంటర్‌టైనర్‌లకు దర్శకత్వం వహించిన దర్శకుడు తిరుమల కిషోర్ ఈ ట్రైలర్‌లో తనదైన శైలిని చూపించాడు.

రష్మిక తల్లిగా నటించిన ఖుష్బు తన కూతురు పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తుంది అని చెప్పుంది. మ‌రి శర్వానంద్ దానికి అంగీకరిస్తాడా? లేదా.. అన్న‌విష‌యం మనం థియేటర్లలో చూడాల్సిందే. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం సమకూర్చారు. కాగా, మార్చి 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement