Thursday, April 25, 2024

Breaking : నర్సంపేటలో తీవ్ర విషాదం… ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్..

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణానికి చెందిన కొంపెల్లి శివ, కళ్యాణ్, అరవింద్ లు వరంగల్ కు చెందిన రాముతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తున్న క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కోటిలింగాల మూల మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు – లారీ ఢికొన్నాయి. ఈ ఘటనలో రాము, కళ్యాణ్, శివ మృతి చెందినట్లు తెలుస్తోంది. పొట్ట కూటి కోసం వెళ్లి విగత జీవులుగా మారిన మృతుల కుటుంబాలలో విషాదం నెలకొంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణానికి చెందిన యువకులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement