Saturday, April 20, 2024

హైద‌రాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌

హైదరాబాద్ లోని హబ్సిగూడలో విషాదకర ఘటన జ‌రిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అపార్ట్ మెంట్ లో ఉరేసుకుని చ‌నిపోయారు. మృతిచెందిన వారిలో దంపతులతో పాటు మరో మహిళ, నాలుగేళ్ల బాలిక ఉన్నారు. మృతులను ప్రతాప్ (34), సింధూర (32), ఆద్య (4), ప్రతాప్ తల్లిగా గుర్తించారు.

చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ల షోరూమ్ లో ప్రతాప్ డిజైనర్ మేనేజర్ గా పని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సింధూర హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు. తొలుత ఆద్యకు ఉరి వేసి, ఆ తర్వాత కుటుంబం అంతా ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement