Thursday, March 28, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం.. గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవ్వాల (మంగళవారం) విషాదం చోటు చేసుకుంది. విమానంలో ఉండ‌గానే గుండెపోటు రావడంతో ఓ ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. కువైట్-హైదరాబాద్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఈ వ్యక్తి ల్యాండింగ్‌కు ముందు చెస్ట్​ పెయిన్​ వస్తోందని స్టాఫ్ కు చెప్పాడు.

దీంతో పైలట్ హైదరాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, వైద్య బృందాలను అప్రమత్తం చేసి ల్యాండ్ చేశాడు. విమానాశ్రయం ఆవరణలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగానే అతను దారిలోనే చనిపోయాడు. దీనికి సంబంధించి RGIA పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement