Tuesday, April 16, 2024

BREAKING NEWS – ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ట్రాక్ట‌ర్ బోల్తా – 20 మంది దుర్మ‌ర‌ణం

ఉత్తరప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్‌పూర్‌లో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో 20 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 20 మంది మృతి చెందినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ బ్రిడ్జి రెయిలింగ్ విరిగి కిందపడటంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన థానా తిల్హర్ ప్రాంతంలోని బిర్సింగ్‌పూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

సీఎం యోగి సంతాపం
ఈ ఘటనపై సీఎం యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనాస్థలికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా పరిపాలన అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement