Thursday, March 28, 2024

బీబీ నగర్‌ వద్ద ట్రాక్ పునరుద్ధరణ పనులు ముమ్మరం

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పిన విష‌యం తెలిసిందే. బీబీ నగర్‌ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ట్రాక్ పైకి తెచ్చిన రైల్వే సిబ్బంది. ప్రమాద స్థలం నుంచి సికింద్రాబాద్ రైల్వే షెడ్ కు ఆరు బోగీల తరలించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కొత్త రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.
విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బీబీ నగర్‌ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయితే కాజీపేట- సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement