Thursday, April 25, 2024

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌లో మంగళవారం నాడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్ర‌య‌త్నించ‌గా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో బుధవారం నాడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు త‌న ఇంటిపై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డితే పోలీసులు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement