Friday, April 19, 2024

ఈనెల 24న కేసీఆర్ దత్తత గ్రామంలో రేవంత్‌రెడ్డి దీక్ష

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనెల 24న కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24న సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 48గంటల దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.

తొలుత ఈనెల 24న సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో ఆత్మగౌరవ సభ పెట్టాలని మొదట నిర్ణయించినా తక్కువ సమయంలో జనసమీకరణకు ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీంతో ఈ సభకు బదులుగా సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. నియోజకవర్గ కోఆర్డినేటర్‌, మూడచింతలపల్లి జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసమీరణ చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొనే ఈ దీక్ష విజయవంతానికి గజ్వేల్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల నేతలు కృషిచేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది.

ఈ వార్త కూడా చదవండి: మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల ఆడియో.. సోషల్ మీడియాలో వైరల్

Advertisement

తాజా వార్తలు

Advertisement