Thursday, April 25, 2024

టవర్ల వారీగా రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలం.. గాజులరామారం, పోచారంలో రెడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మరో దఫా రాజీవ్‌ స్వగృహా టవర్ల విక్రయానికి ప్రభుత్వం నోటిఫికేషఁన్‌ విడుదల చేసింది. గాజులరామారం, పోచారంలలోని పూర్తిగా సిద్దంకాని సెమీ ఫినిష్డ్‌ రాజీవ్‌ స్వగృహ టవర్లను విక్రయించేందకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే రాజీవ్‌ స్వగృహకు చెందిన ఫ్లాట్లను విడివిడిగా అమ్మకాలు పూర్తి చేస్తున్న ప్రభుత్వం తాజాగా టవర్ల వారీగా విక్రయాలకు సిద్ధమైంది. ఇలా పోచారంలోని 4, గాజుల రామారంలోని 5 టవర్లను గంప గుత్తగా విక్రయించాలని నిర్ణయించింది.

పోచారంలోని ఒక్కో టవర్‌లో 72నుంచి 198 ఫ్లాట్లు ఉండగా, గాజుల రామారంలోని ఒక్కో టవర్‌లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ విక్రయ నోటిఫికేషన్‌ ప్రకారం ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు టవర్‌ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 చివరితేదీగా హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌లో పేర్కొంది. వెబ్‌సైట్‌లో టవర్ల వివరాలు, పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement