Friday, April 19, 2024

భారత్‌, బంగ్లా జట్ల మధ్య రేపు రెండో టెస్ట్‌ మ్యాచ్‌..

తాజాగా మరో సిరీస్‌ కోసం భారత్‌, బంగ్లాదేశ్‌లు సిద్దమయ్యాయి. రేపటి(గురువారం)నుంచి ఈ రెండు దేశాల మధ్య రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉందని ఢాకా వాతావరణ శాఖ వెల్లడించింది. చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించి బంగ్లాదేశ్‌ను వారి స్వంతగడ్డపై తుడిచి పెట్టేయాలని టీమిండియా భావిస్తోంది. అలాగే వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ చేరే అవకాశాలను మెరుగు పర్చుకోవాలని రాహుల్‌ సేన యోచిస్తుంది.

గాయాల బాధ వెంటాడుతున్నా టీమ్‌ ఇండియాను రాహుల్‌ ద్వయం ఎలా ముందుకు తీసుకెళ్తుదేమోనని అభిమానుల్లో ఆందోళన కొనసాగుతుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేలికి గాయంతో తొలి టెస్టుకు దూరం కాగా రెండో మ్యాచుకు అందుబాటులో ఉండటం అనుమానమే. మరో వైపు షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేరు. అయినప్పటికీ బౌలింగ్‌లోనూ ఉమ్రాన్‌ మాలిక్‌, ఉమేష్‌ యాదవ్‌, అశ్విన్‌ ఉండగా విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌, పుజారా, రాహుల్‌, పంత్‌తో బ్యాటింగ్‌లోనూ టీమ్‌ ఇండియా బలంగానే ఉంది.

మరో వైపు బంగ్లాదేశ్‌ తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. షకీబ్‌ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి టెస్ట్‌ ప్రదర్శన ఆధారంగా ఎలాంటి మార్పులకు అవకాశం లేనప్పటికీ అశ్విన్‌ స్థానంలో లెప్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌కు అవకాశం కల్పిస్తారని కొందరు భావిస్తున్నారు.

- Advertisement -

షేర్‌ ఏ బంగ్లా స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమిండియా ముగ్గురు స్పిన్నర్ల ఆప్షన్‌కు కట్టుబడి ఉండటం ఖాయమని తెలుస్తోంది. సౌరభ్‌ కుమార్‌ బౌలింగ్‌తో పాటు ప్రామిసింగ్‌ బ్యాటర్‌ కావడంతో అతనికి అవకాశం ఇవ్వడం సబబే అని మరికొందరు భావిస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్‌ ఆడిన జట్టులో మరో మార్పు చేసే ఆస్కారం లేదు. జట్టులో ఇది వరకే ఇద్దరు లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి తొలి టెస్ట్‌లో బ్యాట్‌తో రాణించిన అశ్విన్‌ను కొనసాగించాలని, వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాల నేపథ్యంలో టీమ్‌ ఇండియా యాజమాన్యం ఎలాంటి ప్రయోగాలు చేయరాదని మరికొందరు కోరుకుంటున్నారు.

భారత జట్టు : కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభమన్‌ గిల్‌, చతేశ్వర్‌ పూజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌/సౌరభ్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌ , కుల్దిdప్‌ యాదవ్‌, మహమ్మద్‌ సిరాజ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement