Saturday, March 23, 2024

రేపు, ఎల్లుండి తాగునీరు సరఫరా బంద్‌.. ప్రకటించిన మున్సిపల్‌ అధికారులు

తాండూరు, (ప్రభన్యూస్‌) : రేపు, ఎల్లుండి తాండూరు పట్టణంలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. పట్టణంలోని విలియమూన్‌ చౌరస్తాలో ప్రధాన పైపులైన్‌ మరమ్మత్తులను చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ కారణంగా రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్ల‌డించారు. కావున ప్రజలు తాగునీటికి పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ.. తాగునీటి సరఫరా అంతరాయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement