Friday, March 29, 2024

రేపు మ‌ధ్యాహ్నం.. తెలంగాణ కేబినెట్ భేటీ..

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం తెలంగాణ‌ మంత్రివర్గం భేటీ కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ స‌మావేశం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వ‌డ్ల‌ కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపైనా చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement