Wednesday, April 24, 2024

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. శుక్రవారం ఆయన ఊరు నుంచి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఫిట్స్ కారణంగా ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించినట్టు నాగేశ్వరరావు కుమారుడు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు.

కాగా, నాగేశ్వర రావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. 1986 నుంచి ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు. అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ గా ఆయన కెరీర్ ను ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ సినిమాను తెరకెక్కించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement