Friday, April 19, 2024

Tokyo Olympics: ఇండియ‌న్ బాక్స‌ర్ స‌తీష్‌కుమార్‌ ఓటమి

టోక్యో ఒలింపిక్స్ పతకం కొట్టేలా కనిపించిన ఇండియన్ బాక్సర్ సతీస్ కుమార్ కథ ముగిసింది. క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో 91 కేజీల సూప‌ర్ హెవీ వెయిట్ కేట‌గిరీలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో పతకానికి అడుగు దూరంలో నిలిచినట్లయింది. వరల్డ్ నెంబర్ వన్ బాక్సర్ అయిన జలలోవ్ బఖోదిర్ చేతిలో సతీష్ 0-5 తేడాతో పరాజయం చెందాడు. తొలి రౌండ్ నుంచే స‌తీష్‌పై పూర్తిగా పైచేయి సాధించిన జ‌ల‌లోవ్‌ను ఏక‌గ్రీవంగా ఐదుగురు జ‌డ్జీలు విజేత‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌తి రౌండ్‌లోనూ జ‌డ్జీలు జ‌ల‌లోవ్ వైపే మొగ్గుచూపారు. ప్ర‌త్య‌ర్థి విసిరిన బ‌ల‌మైన పంచ్‌ల ముందు స‌తీష్ నిల‌వ‌లేకపోయాడు.

ఇది కూడా చదవండి: RRR: విడుదలయిన దోస్తీ సాంగ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement